25. మహాషోఢాన్యాసఫలము
కులార్ణవమునందు భగవాన్ శంకరుడు మహాషోఢాన్యాసమును తెలిపెను. ఎవరైతే ఈ న్యాసములు చేస్తారో వారు సాక్షాత్ పరమశివుడవుతారు. ఎవరు ఈ న్యాసములను ప్రతిరోజూ చేస్తారో వారికి నిగ్రహానుగ్రహ సమర్థత కలుగుతుంది. ఇందు సందేహము లేదు. దేవతలందరూ అతడికి నమస్కారము చేస్తారు. ఏ స్థలములో ఈ న్యాసములు చేయబడునో ఆ స్థలము నాలుగు దిక్కులందునూ, పదియోజనముల వరకు దివ్యక్షేత్రము అవుతుంది. ఈ న్యాస సాధకుడు ఎక్కడకు వెళ్ళినా అతనికి విజయ లాభము, సన్మానము, గౌరవము లభించును. ఈ న్యాస సాధకుడు ఎవరికైనా వందనము చేస్తే అతడు ఆరు మాసములలో మృతిచెందుతాడు. ఈ న్యాసముకు వజ్ర పంజరన్యాసమని పేరు. ఈ న్యాస సాధకుడిని చూసిన, దివ్యలోకములు, అంతరిక్షము, భూమి, పర్వతము, జలము, వనములందు జీవించువారలకు, ప్రచండ భూత, భేతాళ, దేవ, రాక్షస, గ్రహాదులకు భయము కలుగును. ఈ న్యాస సాధకునకు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, ఋష్యాది మునులు నమస్కారము చేయుదురు. ఈ న్యాసమును అనధికారులకు చెప్పరాదు. ఈ న్యాసము వలన ఆజ్ఞాసిద్ధి లాభిస్తుంది. దేవతాభావ ప్రాప్తి కొరకు ఈ న్యాసమును మించిన మరియొక సాధనము లేదు. ఇది సత్యము. ఊర్ధ్వామ్నాయ ప్రవేశము, పరాప్రాసాదధ్యానము, మహాషోఢా న్యాసము/జ్ఞాన ఫలము దేనికీ సాటిరావు.